Friday, March 15, 2024

నారా లోకేష్ ను కలిసిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి

యువగళంలో భాగంగా నారా లోకేష్ పాదయాత్ర సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో కొన‌సాగుతుంది. గురువారం ఓడి చెరువు మండలం వణుకు వారిపల్లి వద్ద ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో ఉన్న నారా లోకేష్ ను మాజీ మంత్రి, టీడీపీ పుట్టపర్తి నియోజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితోపాటు ఆయన కుమారుడు పల్లె వెంకటకృష్ణ కిషోర్, కోడలు పల్లె సింధూర ప్రత్యేకంగా కలిసారు. ఈ సందర్భంగా పల్లె కృష్ణ కిషోర్, పల్లె సింధూర రెడ్డిని నారా లోకేష్ ఆప్యాయంగా పలకరించి కుటుంబ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడప్పుడు పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటిస్తూ మీ తండ్రి పల్లె రఘునాథ్ రెడ్డికి అండగా ఉండాలని పల్లె కృష్ణ కిషోర్ కు సూచించారు. టీడీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని మండలాల్లో ఇంటింటా ప్రచారాన్ని చేపట్టి తన విజయానికి కుమారుడు, కోడలు ఇద్దరూ బాగా కృషి చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి లోకేష్ కు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement