Saturday, May 4, 2024

ఐసీసీ కమిటీలో హైద‌రాబాద్ మాజీ క్రికెట‌ర్‌ లక్ష్మణ్‌కు చోటు..

ఐసీసీ మెన్స్‌ క్రికెట్‌ కమిటీలో ఆటగాళ్ల ప్రతినిధిగా టీమిండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఎంపికయ్యాడు. ప్రస్తుతం లక్ష్మణ్‌ జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ) హెడ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వీవీఎస్‌ లక్ష్మణ్‌ను మెన్స్‌ క్రికెట్‌ కమిటీలో భాగంగా ఆటగాళ్ల ప్రతినిధిగా ఎంపిక చేసినట్లు ఐసీసీ ప్రకటించింది.

లక్ష్మణ్‌తోపాటు న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ డేనియల్‌ వెటోరిని కూడా ప్రతినిధిగా ఎంపిక చేసినట్లు బర్మింగ్‌హోమ్‌ వేదికగా ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రోజర్‌ హార్పర్‌, మహేళ జయవర్దనేలను ఐసీసీ మెన్స్‌ కమిటీలో పాస్ట్‌ ప్లేయర్స్‌ ప్రతినిధులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement