Friday, April 26, 2024

ఆదాయానికి మించి ఆస్తులు, దోషిగా హ‌ర్యానా మాజీ సీఎం చౌతాలా.. 26న శిక్ష ఖ‌రారు చేయ‌నున్న కోర్టు

హ‌ర్యానా మాజీ సీఎం ఓం ప్ర‌కాశ్ చౌతాలా మ‌రో కేసులో దోషిగా తేలారు. ఇప్ప‌టికే టీచ‌ర్ల కుంభ‌కోణంలో ఆయన దోషిగా నిరూపితమై, ప‌దేళ్ల పాటు జైలు జీవితం గ‌డిపారు.. జైలు శిక్ష పూర్తి చేసుకుని గ‌తేడాది జులైలో ఆయ‌న విడుద‌ల‌య్యారు. ప‌దేళ్ల జైలు శిక్ష అనుభ‌వించి వ‌చ్చి ఏడాది కాక‌ముందే మ‌రో కేసులో దోషిగా తేలిన ఆయ‌నకు ఈ సారి ఏ త‌ర‌హా శిక్ష ప‌డుతుందోన‌ని అంత‌టా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. తాజా కేసు విష‌యానికి వ‌స్తే.. ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగిన ఆరోప‌ణ‌ల‌పై చౌతాలాపై గ‌తంలోనే కేసు న‌మోదు అయ్యింది. ఈ కేసు విచార‌ణ‌ను చేప‌ట్టిన ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు శ‌నివారం చౌతాలాను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఆయ‌న‌కు ఏ త‌ర‌హా శిక్ష విధించాల‌న్న విష‌యంపై ఈ నెల 26న చేప‌ట్ట‌నున్న విచార‌ణ‌లో కోర్టు నిర్ణ‌యం తీసుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement