Wednesday, July 24, 2024

షర్మిల పార్టీలోకి మాజీ డీజీపీ?

ఈనెల 9న ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభలో షర్మిల కొత్త పార్టీని ప్రకటించనున్న క్రమంలో ఆమెకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. మాజీ డీజీపీ స్వరన్ జిత్ సేన్ షర్మిల పార్టీలో చేరే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారం నాడు ఆయన లోటస్‌పాండ్‌లో వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన స్వరన్ జిత్ సేన్.. ప్రజల బాగు కోరుకునే వారికి త‌మ మ‌ద్దతు ఉంటుందని, అందులో త‌ప్పేముంద‌ని వ్యాఖ్యానించారు. త‌మకు వైఎస్ఆర్ కుటుంబంతో ఎప్పటినుంచో సాన్నిహిత్యం ఉంద‌ని, ష‌ర్మిల పార్టీ పెడుతున్న నేప‌థ్యంలో మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిసి శుభాకాంక్షలు చెప్పినట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement