Thursday, April 25, 2024

విమానాశ్రయంలో విదేశీ బంగారం సీజ్‌

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి విదేశీ బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో అతని కుర్తా గుండీలు, మేకప్‌ కిట్‌లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. అతని వద్ద సుమారు 220 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement