Monday, April 29, 2024

మూసీ నదికి వరద పోటు – అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

సూర్యాపేట రూరల్ ప్రభ న్యూస్: మూసి నదికి వరద ఉధృతి పెరిగింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు హైదరాబాదులో గత రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుండి 13,259 క్యూసెక్కుల నీరు నదిలో వచ్చి చేరుతుండగా 5 గేట్లను 3 ఫీట్ల మేర ఎత్తి 9412 క్యూసెక్కుల నీటిని, కాలువల ద్వారా 378 క్యూసెక్కుల నీటిని మొత్తం 9790 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

భారీ వర్షాల నేపథ్యం లో ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ఇచ్చిన క్రమంలో మూసీ నదికి పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు సూర్యాపేట నల్లగొండ పోలీసులు అప్రమత్తమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement