Sunday, May 19, 2024

Flipkart | ప్లిప్‌కార్ట్‌ ఇయర్‌ ఎండ్‌ సేల్‌..

ప్రముఖ ఇక్ఖామర్స్‌ సంస్థ ప్లిnప్‌కార్ట్‌ ఇయర్‌ ఎండ్‌ సేల్‌ను ప్రకటించింది. డిసెంబరు 9 నుంచి 16 వరకు వారంపాటు ఈ సేల్‌ కొనసాగనుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, ఫ్యాషన్‌, గృహూపకరణాలపై భారీ డిస్కౌంట్‌ అందించనుంది. ప్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్‌షిప్‌ యూజర్లు ఒక రోజు ముందుగానే ఈ సేల్‌లో పాల్గొనవచ్చని ప్రకటించింది. ఐఫోన్‌14 రిటైల్‌ ధర రూ.69,900 ఉండగా, ఈ సేల్‌ ద్వారా రూ.55,000కే కొనుగోలు చేయవచ్చని ప్లిప్‌కార్ట్‌ పేర్కొంది.

మోటోరోలా ఎడ్జ్‌ 40 తగ్గింపు ధరలు అందిస్తోంది. రూ.34,999 ధర వద్ద విడుదలైన ఈ ఫోన్‌ రూ.25,499కే లభిస్తుంది. ఇన్ఫీనిక్స్‌ హాట్‌ 30ఐను రూ.7,149కే కొనుగోలు చేయవచ్చు. నథింగ్‌ ఫోన్‌2 ధర రూ.39,999 కాగా.. తాజా సేల్‌లో రూ.34,999కే కొనుగోలు చేయవచ్చు. అయితే బ్యాంక్‌ ఆఫర్లు, సేల్‌ ప్రత్యేక తగ్గింపు, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లను కలిపిన తర్వాత ఈ ధరలు వర్తిస్తాయి.

వీటితో పాటు గూగుల్‌ పిక్సెల్‌7, రియల్‌మీ సీ53, శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌14 5జీ, పోకో సీ55, రియల్‌మీ 11 ప్రో 5జీ, సహా మరికొన్ని స్మార్ట్‌ఫోన్లపై గణనీయమైన తగ్గింపు ఉండనున్నట్లు వెబ్‌సైట్‌ ద్వారా తెలుస్తోంది. ఇక ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులపై 75శాతం డిస్కౌంట్‌ పొందొచ్చని ప్లిnప్‌కార్ట్‌ తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్‌ అందించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement