Monday, May 6, 2024

మ‌రో అధిరిపోయే సేల్ ప్ర‌క‌టించిన ఫ్లిప్‌కార్ట్.. ఈ వస్తువులపై 75 శాతం డిస్కౌంట్లు

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఈ నెలలో ఇప్పటికే బిగ్ సేవింగ్ డేస్ సేల్, బిగ్ బచాత్ ధమాల్ సేల్ లో ఆఫర్ల వర్షం కురిపించ‌గా.. తాజాగా గ్రాండ్ అప్లియెన్సెస్ సేల్ ను ప్రకటించింది. ఈ రోజు ప్రారంభమైన ఈ సేల్ 5 రోజుల పాటు (14నుండి 18వ తేదీ వరకు) జ‌ర‌గ‌నుంది. ఇండిపెండెన్స్ డే వేడుకల సమయంలో జరుగుతున్న ఈ సేల్ లో టీవీలు, ఇతర అప్లియెన్సెస్ పై ఏకంగా 75 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని ప్రకటించింది ఫ్లిప్ కార్ట్.

ఈ సేల్ లో స్మార్ట్ టీవీలపై ఏకంగా 70 శాతం డిస్కౌంట్లను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. అంతే కాకుండా కేవలం రూ.239తో ప్రారంభమయ్యే ఈఎంఐ ఆప్షన్లతో మీరు వాషింగ్ మిషన్లను మీ ఇంటికి తెచ్చుకోవచ్చు. రిఫ్రిజిరేట్లపై కూడా అదిరిపోయే ఆఫర్లు ఉంన్నాయి. ఏసీలను కూడా రూ.2,499 ఈఎంఐ ఆఫర్లతో సొంతం చేసుకోవచ్చు. ఇంకా గీజర్ తదితర హీటింగ్, కూలింగ్ అప్లియెన్సెస్ పై ఏకంగా 80 శాతం డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

- Advertisement -

ఇతర హెం అప్లియెన్సెస్ పై ఏకంగా 70 శాతం వరకు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తన సేల్స్ పేజీలో పేర్కొంది. కిచెన్ అప్లియెన్సెస్ కేవలం రూ.299 నుంచి ప్రారంభం అవుతాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. మైక్రోఓవెన్స్ పై 45 శాతం వరకు తగ్గింపులు ఉంటాయి. ఈ సేల్ లో భారీ బ్యాంక్ ఆఫర్లను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. AU Small Finance Bank, Bank Of Baroda, IDFC First Bank, Yes Bank ద్వారా ఈ సేల్ లో షాపింగ్ చేస్తే అదనంగా మరో పది శాతం డిస్కౌంట్ పొందొచ్చని ఫ్లిప్ కార్ట్ తన సేల్స్ పేజీలో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement