Monday, May 6, 2024

Haryana: పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం.. ఐదుగురు మృతి

పెళ్లికి వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా జ‌రిగిన రోడ్డుప్ర‌మాదంలో ఐదుగురు మృతిచెందిన ఘ‌ట‌న హర్యానాలో ఇవాళ జ‌రిగింది. హర్యానాలోని రేవారిలో బుధవారం హర్యానా బస్సు, కారు ఎదురుగా ఢీకొనడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బాధితులు పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా మహేంద్రగఢ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది.

కారును బస్సు ఢీకొనడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. వారు హర్యానాలోని చర్కీ దాద్రీ నివాసితులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement