Sunday, May 5, 2024

Uttarakhand: కొండచరియలు విరిగిపడి.. ఐదుగురు మృతి

భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి ఐదుగురు మృతిచెందిన విషాద ఘటన ఉత్తరాఖండ్‌ లో చోటుచేసుకుంది. కేదార్‌నాథ్ మార్గంలో ప్రయాణిస్తోన్న కారుపై కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు యాత్రికులు దుర్మరణం చెందారు. రుద్రప్రయాగ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు గుజరాత్ వాసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తర్సాలి ప్రాంతంలోని గుప్తకాశి-గౌరీకుండ్‌ జాతీయ రహదారి సమీపంలో కొండ చరియలు విరిగిపడటంతో 60 మీటర్ల మేర రోడ్డు కొట్టుకుపోయింది. ఆ సమయంలో కేదార్‌నాథ్‌ వెళ్తున్న యాత్రికుల కారుపై అవి విరిగిపడ్డాయి. దీనిపై సమాచారం అందుకున్న రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. తీవ్రంగా ధ్వంసమైన కారు నుంచి ఐదు మృతదేహాలను వెలికితీశారు.

 

Advertisement

తాజా వార్తలు

Advertisement