Sunday, April 28, 2024

National : ఏకవారి అడవుల్లో కాల్పుల మోత‌..

చ‌త్త‌స్ గ‌ఢ్‌లో కాల్పుల మోత మోగింది. ఏకవారి అడవుల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. మెయిన్పూర్ నువాపాడ జాయింట్ డివిజన్ కు చెందిన మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో గాలింపు చేపట్టారు.

పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. సుమారు అర్ధగంటపాటు కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. పోలీసుల దాడి నుంచి మావోయిస్టులు తప్పించుకొని పారిపోయారు. ఘటనా స్థలం నుంచి బీజీఎల్ లైవ్ గ్రెనేడ్, నిషేధిత మావోయిస్టు సంస్థ ప్రచార సామాగ్రి, బ్యానర్లు, సాహిత్యం, మావోయిస్టుల యూనిఫాం, సోలార్ ప్లేట్, వైర్ బండిల్, రోజువారి వినియోగ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement