Sunday, May 19, 2024

టపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం..ఇద్దరు సజీవ దహనం

టపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. విజయవాడ గాంధీనగర్‌ జింఖానా గ్రౌండ్‌లో పటాకుల దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఓ దుకాణంలో టపాసు పేలింది. దీంతో షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక్కొక్కటిగా అన్ని పటాకులు పేలడంతో మంటలు పక్కనేఉన్న రెండు దుకాణాలు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో మూడు షాపులు దగ్ధమయ్యాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే.. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. మృతులను పటాకుల దుకాణంలో పనిచేసే సిబ్బందిగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement