Sunday, April 28, 2024

Kota : హాస్ట‌ల్‌లో అగ్నిప్ర‌మాదం… విద్యార్థుల‌కు తీవ్ర గాయాలు

రాజ‌స్థాన్‌లో అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. కోటాలోని ఓ హాస్ట‌ల్‌లో ఇవాళ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో హాస్ట‌ల్‌లోని 8మంది విద్యార్థులకు తీవ్ర గాయాల‌య్యాయి.

కున్హారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ల్యాండ్మార్క్ సిటీలో ఈ ఘటన జరిగినట్టు కోటా పోలీస్ ఉన్నతాధికారి అమృత దుహాన్ తెలిపారు. ప్రమాదానికి గురైన హాస్టల్లో ఘటన జ‌రిగిన‌ సమయంలో మొత్తం 70 మంది విద్యార్థులు ఉన్నట్టు వెల్లడించారు. విద్యార్థులు తప్పించుకునే సమయంలో తొక్కిసలాట సైతం జరిగిందని..ఈక్రమంలోనే వారికి తీవ్ర గాయాలైనట్టు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మ‌ర్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement