Sunday, April 28, 2024

Rajasthan: హీటర్‌లో చెలరేగిన మంటలు.. తండ్రి, కూతురు సజీవదహనం..

హీటర్ లో మంటలు చెలరేగడంతో తండ్రి, మూడు నెలల కూతురు సజీవ దహనమైన విషాద ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ లోని ఖైర్తాల్-తిజారా జిల్లాలో ఇవాళ గదిలోని హీటర్‌కి మంటలు అంటుకోవడంతో తండ్రి, మూడు నెలల కూతురు సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో అతని భార్యకు గాయాలయ్యాయి. దీపక్ యాదవ్, అతని కుమార్తె మూడు నెలల నిషిక సజీవ దహనయ్యారు. దీపక్ భార్య సంజుకి కాలిన గాయాలయ్యాయి.

ఈ ఘటనలో కేకలు విన్న ఇరుగుపొరుగు వారు బాధితులను రక్షించేందుకు, మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఇద్దరి ప్రాణాలు కాపాడలేకపోయారు. తీవ్రగాయాలైన తండ్రీ, కూతుళ్లను సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరణించిన దీపక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చలికాలంలో ఇళ్లలో వినియోగించే హీటర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement