Thursday, May 2, 2024

Fire Accident – వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు – భయంతో ప్రయాణీకులు పరుగులు

భోపాల్. – వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగాయి. భోపాల్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్‌ ఎక్స్‌‍ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. రైలులోని సీ-14 కోచ్‌ వద్ద మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో భయంతో ప్రయాణీకులు పరుగు తీశారు.వివరాల ‍ప్రకారం.. సోమవారం ఉదయం వందే భారత్‌ రైలు భోపాల్‌ నుంచి ఢిల్లీ బయలు దేరింది. ఈ క్రమంలో రాణికమలాపాటి స్టేషన్‌ నుంచి ప్రయాణం మొదలైన తర్వాత కుర్వాయి స్టేషన్‌ వద్ద రైలులోని బ్యాటరీ నుంచి మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో రైల్వే సిబ్బంది మంటలను గుర్తించిన వెంటనే లోకోపైలట్‌కు సమాచారం అందించారు. దీంతో, రైలును అక్కడే నిలిపివేశారు.

అగ్నిమాపక దళం అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అర్పివేశారు. రైలులో ‍మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement