Saturday, May 4, 2024

ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం..ఇద్దరు సజీవ దహనం

ముంబైలోని కరోనా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు కరోనా రోగులు సజీవదహనమయ్యారు. ఘటన సమయంలో 76 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో మంటలు వ్యాపించిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది దాదాపు 70 మంది కరోనా బాధితులను మరో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. 23 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. షాపింగ్ మాల్ లో ఓ ఆస్పత్రి ఉండటంపై అధికారులపై మండిపడుతున్నారు ప్రజలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement