Thursday, April 25, 2024

విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన కరోనా రోగులు

విజయనగరం జిల్లా ఎం.ఆర్. ప్రభుత్వాసుపత్రిలో పెనుప్రమాదం తప్పింది. ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ వార్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో దట్టమైన పొగలు వ్యాపించడంతో ఒక్కసారిగా ఆస్పత్రిలోని కోవిడ్ బాధితులు భయంతో పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది మంటలు ఆర్పివేసి అధికారులకు సమాచారం ఇచ్చారు. కోవిడ్ ఐసీయూలో ఉన్న కోవిడ్ బాధితులను, మిగిలిన వార్డులోని కోవిడ్ రోగులను సాధారణ వార్డుకి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. లేదంటే భారీ ప్రమాదమే జరిగి ఉండేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement