Thursday, April 25, 2024

Tamil Nadu : సినీ న‌టి రాధిక‌ ఆస్తి విలువ రూ .53 కోట్లు…

తమిళనాడు లోని విరుదునగర్‌ నుంచి బరిలోకి దిగిన భాజపా అభ్యర్థి, ప్రముఖ నటి రాధికా శరత్‌ కుమార్ నామినేషన్‌ దాఖలు చేశారు. ఇందులో తన మొత్తం ఆస్తుల విలువను రూ.53.45కోట్లుగా ప్రకటించారు. రూ.33.01లక్షల నగదు, 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, వస్తువులతో కలిపి రూ.27.05కోట్ల చరాస్తులున్నట్లు రాధిక నామినేషన్‌లో పేర్కొన్నారు.

రూ.26.40కోట్ల స్థిరాస్తులతో పాటు రూ.14.79కోట్ల అప్పులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె రాడాన్‌ మీడియా వర్క్స్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

ఇటీవల రాధిక భర్త, నటుడు ఆర్‌. శరత్‌ కుమార్ తన పార్టీ ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి ని భాజపాలో విలీనం చేశారు . ఈ క్రమంలోనే విరుదునగర్‌ నుంచి కాషాయ పార్టీ ఆమెను నిలబెట్టింది. ఈ స్థానానికి తొలి దశలోనే ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనుంది. రాధిక ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement