Saturday, July 27, 2024

గ‌ట్టిగా ఏడుస్తూ..వింత‌గా ప్ర‌వ‌ర్తించిన‌ విద్యార్థులు-హ‌డ‌లిపోయిన టీచ‌ర్లు-ప‌రిశీలిస్తోన్న నిపుణులు

ఓ స్కూల్ లో విద్యార్థినిలు గ‌ట్టిగా ఏడుస్తూ..అరుస్తూ..నేల‌పై దొర్లుతూ..గోడ‌కి త‌ల‌బాదుకుంటూ..వ‌ణికిపోతూ క‌నిపించారు. దాంతో స్కూల్ టీచ‌ర్లు హ‌డ‌లెత్తిపోయారు.ఈ సంఘ‌ట‌న ఉత్త‌రాఖాండ్ లో చోటు చేసుకుంది.దాంతో ఏమయిందోనని కంగారుపడ్డ టీచర్లు పిల్లల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, వారు టీచర్ల మాటలు వినిపించుకునే స్థితిలో లేకపోవడంతో సాధ్యం కాలేదు. దీంతో పిల్లల పరిస్థితిపై వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే, తర్వాత కాసేపటికి ఈ పరిస్థితి దానంతట అదే సద్దుమణిగింది. ఈ ఘటనపై ప్రిన్సిపల్ వెంటనే జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

దీంతో అధికారులు కొందరు వైద్యులు, మానసిక నిపుణులను పాఠశాలకు పంపించారు. వారు వచ్చిన సమయంలో కూడా పిల్లలు ఇలాగే ప్రవర్తించారు. తర్వాత పిల్లలకు రకరకాల పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహించారు. సాధారణంగా ఇలా ఒకేసారి ఎక్కువమంది ఇలా వింతగా, విచిత్రంగా ప్రవర్తించడాన్ని మాస్ హిస్టీరియా అంటారు. పిల్లలు ఇలా చేయడానికి కారణాలేంటి అని.. వారిని అనేకరకాలుగా పరీక్షించారు వైద్యులు. చివరికి ఇటీవలి వరదల్లో తమ స్నేహితురాలు చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయినట్లు.. దానివల్లే ఇలా చేశారేమో అని, అది కూడా ఈ ప్రవర్తన కు ఒక కారణం అయి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

మరోవైపు పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని.. కొంతమంది కంటి సమస్యలు కూడా ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఇలాంటి ఘటనలే ఇటీవలి కాలంలో అక్కడి మరికొన్ని ప్రభుత్వ స్కూల్లో కూడా జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అంశంపై నిపుణుల పరిశీలన కొనసాగుతోంది. ఈ సమయంలో స్కూల్ లోని కొందరు వీడియోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేయడంతో.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement