Friday, May 3, 2024

విద్యార్థుల‌ ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ విడుద‌ల చేయాలే.. సీఎం కేసీఆర్ బీసీ విద్యార్థి సంఘం విజ్ఞ‌ప్తి

బీసీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం 33 గురుకుల పాఠశాలలు, 15 డిగ్రీ కాలేజీలు మంజూరు చేసినందుకు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నారోజు రాకేష్ చారి సీఎం కేసీఆర్ కు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. గురుకులాల్లో నాణ్యమైన విద్య అందించడంతో అడ్మిషన్లకు డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న బిసి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. బిసి సంక్షేమ వసతి గృహాలు అద్దె భవనల్లో కాకుండా సొంత భవనాలు నిర్మించి బిసి విద్యార్థులకు తగు సౌకర్యాలు కల్పించాలని మంత్రికి విన్నవించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement