Tuesday, March 26, 2024

‘పసికందు’ పాలిట మృత్యువులా మారిన కన్నతండ్రి

శంషాబాద్ మండలం తొండుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. తనకు పుట్టలేదన్న అనుమానంతో 8 నెలల కుమారుడిని ఓ తండ్రి సంప్‌లో పడేసి చంపేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. తొండుపల్లికి చెందిన గంధం విక్రమ్‌కుమార్‌కు, శంషాబాద్‌కు చెందిన యువతితో ఆరేళ్ల క్రితం పెళ్లయింది. విక్రమ్ కుమార్ బార్బర్ షాపులో పని చేస్తున్నాడు. భార్యపై అనుమానంతో తరచూ గొడవ పడుతుండేవాడు. మూడేళ్ల క్రితం గొడవ పెద్దలు, పోలీసు పంచాయితీ వరకు వెళ్లింది. 8 నెలల క్రితం విక్రమ్ దంపతులకు ఓ బాబు జన్మించాడు. వివాహమైన ఆరేళ్ల తర్వాత పుట్టిన కుమారుడు తన సంతానం కాదేమో అని విక్రమ్‌ అనుమానం పెంచుకున్నాడు. మంగళవారం రాత్రి భార్య పక్కలో నిద్రిస్తున్న పసికందును తీసుకువెళ్లి నీటి సంపులో పడేసి బయటకు వెళ్లిపోయాడు. అక్కడొక స్నేహితుడు కనిపించడంతో అతడితో ఈ విషయం చెప్పాడు. ఆ మిత్రుడు వెంటనే ఇంటికొచ్చి అప్రమత్తం చేయడంతో కుటుంబసభ్యులు సంపులో చూడగా అప్పటికే బాలుడు చనిపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement