Sunday, May 5, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..

రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని చింతలపూడి దగ్గర రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement