Tuesday, April 30, 2024

అసోంలో రోడ్డుప్రమాదం… ముగ్గురు మృతి

ఘోర రోడ్డుప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న‌ అసోంలో జరిగింది. 17మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న ఓ వాహనం ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని దగ్గరలోని మోరిగావ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అసోం రాష్ట్రం మోరిగావ్‌ జిల్లాలోని ధరామ్‌తుల్‌ ఏరియాలో జాతీయ రహదారి 37పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement