Sunday, May 19, 2024

ఘోర రోడ్డు ప్ర‌మాదం… ఐదుగురు యువకుల మృతి

హిమాచల్ ప్రదేశ్‌ ఉనా జిల్లాలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఉనాకు ఆనుకొని ఉన్న కుతార్ కలాన్‌లో శనివారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఐదుగురు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్‌ రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారు.. కుతార్‌ కలాన్‌లో శనివారం రాత్రి స్తంభాన్ని ఢీకొని పొలాల్లోకి చొక్కుకు వెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. కారు డ్రైవర్‌తో పాటు మరో నలుగురిని ఉనా ఆసుపత్రికి తరలించారు. అక్కడ మరో ముగ్గురు యువకులు చికిత్స పొందుతూ మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement