Thursday, May 2, 2024

Maharashtra : ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కటోల్‌లోని సోంఖంబ్ గ్రామ సమీపంలో ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతిచెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వాహనంలోంచి మృతదేహాలను బయటకు తీశామని, పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.

రాత్రి 1:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు కటోల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సుశాంత్ మెష్రామ్ తెలిపారు. రెండు వాహనాల వేగం ఎక్కువగా ఉండడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సమాచారం చేరవేశారు. వారు ప్రమాద స్థలానికి చేరుకుంటున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement