Monday, April 29, 2024

Breaking | ఔటర్ సర్వీస్ రోడ్డుపై ప్రమాదం.. ఒకరు మృతి

ఇబ్రహీంపట్నం, (ప్రభ న్యూస్) : ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగులూరు ఔటర్ సర్వీస్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వారిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఇబ్రహీంపట్నం ఏసిపి శ్రీనివాసరావు, ఆదిభట్ల సీఐ, ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఘటనకు సంబంధించిన వివరాలు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ సర్వీస్ రోడ్డు మీదుగా మన్నెగూడ నుంచి ఆదిభట్ల వైపు వెళ్తున్న టీఎస్ 12యుఏ 5772 నంబర్ గల టిప్పర్, ఆదిభట్ల నుంచి మన్నెగూడ వైపు వెళ్తున్న ఆటోను ఒక్కసారిగా ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రకాష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.

డ్రైవర్ గణేష్, వంశీ, కిరణ్, తీవ్ర గాయాలు కావడంతో వారిని నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రాకేష్ తో పాటు మరో వ్యక్తిని సైతం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి వైద్య పరీక్షల కోసం పంపించారు. ఈ ప్రమాదం ఆటోలో ప్రయాణిస్తున్న యువకులు మద్యం సేవించి వస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు ఆదిభట్ల నుంచి నగరం వైపు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

- Advertisement -

మృతుడు ప్రకాష్ ది సూర్యాపేట నివాసిగా గుర్తించారు. రాకేష్ ది చౌటుప్పల్ మండలం కైతపురానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వంశీ, కిరణ్ తో పాటు మరో వ్యక్తి స్వస్థలాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆదిభట్ల సీఐ రఘువీర్ రెడ్డి, ఎస్ఐలు లక్ష్మీనారాయణ, వెంకటేష్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement