Tuesday, April 30, 2024

ఎడ్ల‌ బండిపై వ‌చ్చి నిర‌స‌న‌.. రైతుపై కేసు న‌మోదు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని ఎస్‌సిసిఎల్‌ (సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌) జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన రైతు సుందర్ లాల్ లోధాపై కేసు నమోదైంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి… SCCL సేకరించిన భూమికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎద్దుల బండిపై కార్యాలయం వద్ద రైతు సుందర్ లాల్ లోధా నిరసన తెలిపారు. రైతు తన ఎడ్లతో ఆఫీస్‌ ముందు నిరసన తెలుపుతుంటే అవి మూత్ర విసర్జన చేశాయి. దీంతో సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు రైతుపై కేసు నమోదు చేశారు. సింగరేణి యాజమాన్యం ఎద్దులు మూత్ర విసర్జన చేస్తున్న సీసీటీవీ ఫుటేజీని ద్వారా పోలీసులకు కంప్లెయింట్ చేసింది. దీంతో ఆ రైతుపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement