Saturday, April 20, 2024

దిగొస్తున్న నూనెల ధరలు.! లీటర్‌కు రూ.20 నుంచి 40 తగ్గుదల

అంతర్జాతీయంగా పెరిగిన ధరలు… దేశీయంగా పన్నుల మోతతో గతేడాది కాలంగా వంట నూనెల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేని విధంగా ఆకాశాన్నంటాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం మూడు దఫాలుగా వివిధ రకాల పన్నులను 40 నుంచి ఏడున్నర శాతానికి తగ్గించింది. దీంతో క్రమేణా నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న నిత్యవసర సరుకుల ధరలతో సతమతమవుతున్న జనాలకు వంటనూనె ధరలు కొద్దిగా ఊరట కలిగిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గించి తీపికబురు అందించింది. దేశవ్యాప్తంగా ప్రధాన రిటైల్‌ మార్కెట్లలో లీటర్‌ వంటనూనెపై రూ 20 నుంచి 40 వరకు ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దేశంలో నూనె గింజల ఉత్పత్తి తగ్గిపోవడంతో ఇతర దేశాల నుంచి దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తుంది. నూనెల వినియోగంలో 50శాతానికి పైగా ఉన్న పామోలిన్‌ ఇండోనేసియా, మాలేషియాల నుంచి దిగుమతి అవుతోంది. అలాగే ఉక్రెయిన్‌, బ్రెజిల్‌ నుంచి సన్‌ ప్లnవర్‌, యూఎస్‌ నుంచి సోయాబీన్‌ దిగుమతి అవుతోంది. దేశీయంగా కాటన్‌, రైస్‌ బ్రాన్‌, వేరుశనగ, ఆవ నూనెలు తయారీలో ఉన్న వినియోగానికి తగ్గట్లుగా ఉత్పత్తులు లేక పోవడంతోనే దిగుమతులు తప్పనిసరి అయింది.

రిటైల్‌ మార్కెట్‌లో గతంలో వేరుశనగ నూనె సగటు రిటైల్‌ ధర లీటర్‌ రూ.180, ఆవనూనె కిలో రూ.184 సోయా ఆయిల్‌ కిలో రూ.148, సన్‌ ప్లవర్‌ ఆయిల్‌ కిలో 165, పామాయిల్‌ కిలో ధర రూ.130గా ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఉన్న ధరలతో పోలిస్తే వేరుశెనగ ??? ఆవనూనెల రిటైల్‌ ధరలు కిలోకు రూ.30 తగ్గాయి. సన్‌ ప్లవర్‌ నూనెల ధరలు కిలోకు కూడా రూ.30 తగ్గినట్లు వ్యాపారులు పేర్కొన్నారు. అదే విధంగా రైస్‌ బ్రాన్‌, సోయా, కాటన్‌ సీడ్‌ ఆయిల్‌ ధరలు కూడా కిలోకు రూ.10 నుంచి 20 వరకూ తగ్గుముఖం పట్టాయి. దేశంలో ప్రధాన నూనె ఉత్పత్తి దారులయిన అదానీ విల్మార్‌, రుచి ఇండస్ట్రీస్ర్‌ కంపెనీలతో సహా ఇతర ప్రధాన వంట నూనె కంపెనీలు లీటరుకు రూ.15-20 ధరలను తగ్గించాయి. వంటనూనెల ధరలను తగ్గించిన కంపెనీలలో జెమిని ఎడిబుల్స్‌ ??? ఫ్యాట్స్‌ ఇండియా, హైదరాబాద్‌, మోడీ నేచురల్స్‌, ఢిల్లీ, గోకుల్‌ రీఫాయిల్స్‌ మరియు సాల్వెంట్‌, విజయ్‌ సాల్వక్స్‌, గోకుల్‌ ఆగ్రో రిసోర్సెస్‌ ఉన్నాయి.

అంతర్జాతీయంగా మార్కెట్లో కమోడిటీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, వంటనూనె ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో వాటి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత సంవత్సరం భారీగా ఉన్న నూనె ధరలు.. అక్టోబర్‌ 2021 నుంచి తగ్గుతూ వస్తున్నాయి. వంట నూనెల మీద దిగుమతి సుంకాలు తగ్గించడం, నకిలీ నిల్వలను నిరోధించేందుకు స్టాక్‌ పరిమితులపై ఆంక్షలు విధించడం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టడంతో వంట నూనెల ధరలు తగ్గడానికి ఒక కారణం. వంటనూనెల విషయంలో దేశం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతుండటంతో.. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి పెంచడానికి సిద్దం అయ్యింది. అందుకు తగ్గట్టుగా మిషన్‌ ఆఫ్‌ ఆయిల్‌పామ్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపడంతో పాటు ఈ మిషన్‌ ఆయిల్‌పామ్‌ పథకానికి రూ.11,040 కోట్లు కేటాయించింది. ఇదిలా ఉండగా ,కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం తగ్గించినపుడల్లా అంతర్జాతీయంగా నూనెలు ఉత్పత్తి చేసే దేశాలు ధరలు పెంచడంతో దేశీయంగా నూనెల ధరలు సుంకాలు తగ్గిన మేర ధరలు తగ్గలేదనే వాదన కూడా వుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement