Wednesday, April 24, 2024

Breaking: చర్చలకు రండి.. ఉద్యోగ సంఘాలకు మంత్రుల కమిటీ ఆహ్వానం

ఏపీలో పీఆర్సీ వివాదం ముదురుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఉద్యోగ సంఘాలకు చర్చలకు రావాలని పిలుపునిచ్చింది.

పీఆర్సీపై చర్చలకు రావాలని ఉద్యోగులను పిలిచామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనన్నారు. ‘సమ్మె నోటీసు ఇచ్చాక కూడా చర్చలకు ఆస్కారం ఉందన్నారు. తమ దగ్గరకు వచ్చి మాట్లాడితేనే వారి సమస్యలు తెలుస్తాయని చెప్పారు. ఎప్పుడైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేది ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. కమిటీ, పీఆర్సీ జీవోలపై చాలా మంది మాట్లాడుతున్నారని, ఉద్యోగ సంఘాల నిర్ణయాలు ఏమిటో చెబితేనే కదా మాకు తెలిసేది అని సజ్జల పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement