Sunday, April 28, 2024

WPL | విఫలమైన యూపీ బ్యాటర్లు.. ఢల్లీ టార్గెట్ ఎంతంటే !

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో భాగంగా ఢిల్లీ, యూపీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. కాగా, ఆ జట్టులో దీప్తి శర్మ మరోసారి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో (48 బంతుల్లో 59) హాఫ్ సెంచరీ సాధించింది. కెప్టెన్ అలిస్సా హీలీ (29) పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లు పరుగులు చేయడంలో విఫలమయ్యారు.

ఢిల్లీ బౌల‌ర్ల‌లో టిటాస్ సాధు, రాధా యాదవ్ రెండు వికెట్లు తీయ‌గా.. శిఖా పాండే, అరుంధతి రెడ్డి, జెస్ జోనాస్సెన్, అలిస్ క్యాప్సీ చ‌రో వికెట్ ద‌క్కించుకున్నారు. ఇక 139 ప‌రుగుల టార్గెట్ తో ఛేజింగ్ కు దిగ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement