Sunday, May 5, 2024

రోడ్డు ప్ర‌మాదంలో గుజ‌రాత్ మాజీ మంత్రి దుర్మ‌ర‌ణం..

గాంధీనగర్‌: గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత వల్లభ్‌బాయ్ వఘాసియా(69) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న కారు బుల్‌డోజర్‌ను ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. కారును ఆయనే స్వయంగా డ్రైవ్ చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో వఘాసియాతో పాటు కారులో ఉన్న మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి 8:30 గంటల సమయంలో అమ్రేలి జిల్లా సావర్‌కుంద్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. విజయ్‌రూపానీ మొదటి సారి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు వఘాసియా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. సావర్‌కుంద్ల నియోజకవర్గం నుంచి 2012లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వఘాసియా మృతి పట్ల సావర్‌కుంద్ల ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే మహేష్ కశ్వాలా విచారం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement