Thursday, April 25, 2024

ఆక్సిజన్ అందక చనిపోయినవారికి ఎక్స్ గ్రేషియో ఇవ్వాలి…సీపీఐ రామకృష్ణ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ అందక మరణించిన 76 మంది కరోనా పేషెంట్ల కుటుంబాలకూ రు.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని లేఖ లో పేర్కొన్నారు రామకృష్ణ. తిరుపతి రుయా ఆస్పత్రిలో 23 మంది కరోనా రోగులు ఆక్సిజన్ అందక మరణించారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 11 మందిని మాత్రమే గుర్తించి, వారికి కుటుంబాలకు రూ 10 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.ఏపీలో అనంతపురం, కదిరి, హిందూపురం, కర్నూలు, విజయనగరం, అమలాపురం, తిరుపతిలలో మొత్తం 76 మంది కరోనా రోగులు ఆక్సిజన్ కొరత వల్ల మృతి చెందారన్నారు సీపీఐ రామకృష్ణ.

Advertisement

తాజా వార్తలు

Advertisement