Tuesday, May 7, 2024

పాపం.. ఈ బాలుడికి ఎంత కష్టం!.. పుట్టెడు దుఃఖంలోనూ ప‌ది పరీక్షకు..

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని వాంకిడి గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థి మొహమ్మద్ ఫజల్ తల్లి శుక్రవారం మృతి చెందారు. రాత్రి అనారోగ్యంతో నిర్మల్ ఏరియా కలిపించ‌గా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. శనివారం వాంకిడి గ్రామంలో అంతక్రియలు ఉండగా.. తల్లి మరణించిన బాధను దిగమింగుకొని మండలంలోని లఖంపూర్ గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో గణిత శాస్త్ర పరీక్షకు మొహ‌మ్మ‌ద్‌ హాజరయ్యాడు. దీంతో తోటి స్నేహితులు విద్యార్థికి మనోధైర్యాన్ని కలిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement