Friday, May 3, 2024

ఈక్విటీల్లో ఇఎస్‌ఐసీ నిధులు.. అనుమతించిన బోర్డు

ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌ నిధులను 15 శాతం వరకు ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుడి పెట్టేందుకు బోర్డు అనుమతి ఇచ్చింది. కార్మిక శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ అధ్యక్షత ఆదివారం నాడు జరిగిన ఈఎస్‌ఐ బోర్డు 189వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇది 10 శాతంగా ఉంది. ఈఎస్‌ఐసిలో కార్మికులు, యాజమాన్యాలు జమ చేసే నిధుల నుంచి స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ నిర్ణయాన్ని బోర్డులో ఉన్న కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రారంభంలో 5 శాతం నిధులను ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టేందుకు అనుమతించిన బోర్డు క్రమంగా దాన్ని 10 శాతానికి, ప్రస్తుతం 15 శాతానికి పెంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement