Friday, May 17, 2024

NZB: ప్రమాదవశాత్తు నిప్పంటుకుని.. రైతు మృతి..

సిరికొండ, మే 3 (ప్రభ న్యూస్) : తన పొలం వద్ద పిచ్చి గడ్డి మొక్కలను కాల్చి వేస్తుండగా ప్రమాదవశత్తు తలారి కిషన్ (58) అనే రైతుకు నిప్పంటుకుని మరణించిన సంఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.

పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి… పెద్దవాల్గోట్ గ్రామానికి చెందిన కిషన్ శుక్రవారం ఉదయం తన పొలంలో పెరిగిన పిచ్చి మొక్కలకు నిప్పంటించాడు. ఈ తరుణంలో మోటార్ ఆన్ ఆఫ్ స్టార్టర్ డబ్బు వైపు మంటలు వస్తున్న సంగతిని గ్రహించిన కిషన్ మంట‌ల‌ను అర్పడానికి ప్రయత్నిస్తుండగా వెనుక వైపు నుంచి వచ్చిన మంటలు కిషన్ కు అంటుకున్నట్లు తెలిసింది. ఈ సమయంలో నలువైపుల మంటలు వ్యాపించడంతో ఆ మంటల్లో కిషన్ కలిపోయినట్లు గ్రామస్థులు చెప్పారు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు శవాన్ని పంచనామా నిమిత్తం నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement