Sunday, May 5, 2024

ఒడిశా లో తృటిలో తప్పిన ఘోర రైలు ప్రమాదం

ఒడిశా బాలేశ్వర్లో త్రుటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సిగ్నలింగ్లో లోపం వల్ల మరమ్మతులు జరుగుతున్న లూప్ లైన్లోకి ప్రవేశించింది రైలు.. లోకోపైలట్ అప్రమత్తతతో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. లూప్లైన్ పనులు జరుగుతున్న విషయాన్ని గమనించిన లోకోపైలట్.. వెంటనే బ్రేకులు వేశాడు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి పనులు జరుగుతున్న లైన్లోకి సిగ్నల్ ఇవ్వడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

దీనిపై సమాచారం అందుకున్న సాంకేతిక సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిగ్నలింగ్లో తలెత్తిన లోపాన్ని సరిదిద్ది.. రైలు రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనతో భద్రక్ నుంచి బాలేశ్వర్ లైనులో రైళ్ల రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. మరమ్మతు చేస్తున్న లైనులోకి అలానే వెళ్లుంటే.. ఘోర ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు వాపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement