Sunday, May 5, 2024

Murder: కాంచీపురంలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు రౌడీషీటర్లు హతం

చెన్నై: తమిళనాడులోకి కాంచీపురంలో ఇద్దరు రౌడీ షీటర్లను ఎన్‌కౌంటర్‌ చేశారు పోలీసులు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, నిందితులు పోలీసులపై దాడికి యత్నించగా కారణంగానే ఎన్‌కౌంటర్‌ జరిగిందని అధికారులు చెబుతున్నారు.

వివరాల ప్రకారరం.. చెన్నైలోని కాంచీపురంలో బుధవారం తెల్లవారుజూమున ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీలను కాంచీపురం పోలీసులు కాల్చి చంపారు. కాంచీపురం రైల్వే బ్రిడ్జి సమీపంలో పోలీసు సిబ్బందిపై దాడి చేయ‌డంతో వారు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో రఘువరన్ , కరుప్పు హసన్ మరణించారు. కాగా, మరో రౌడీ షీటర్‌ ప్రభ హత్య కేసులో వీద్దరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement