Monday, April 29, 2024

ఛత్తీస్గఢ్ లో ఎన్ కౌంటర్.. మావోయిస్టు హతం

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ లోని దంతెవాడ జిల్లాలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌ లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఘ‌ట‌నాస్థ‌లి నుంచి 9 ఎంఎం పిస్తోల్, కంట్రీ మేడ్ బ‌ర్మార్, 3 కేజీల ఐఈడీతో పాటు మెడిసిన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంట‌ర్‌ లో హ‌త‌మైన మావోయిస్టుపై రూ. 5 ల‌క్ష‌ల రివార్డు ఉంద‌ని, అత‌నిపై 15 కేసులు న‌మోదైన‌ట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ ప‌ల్ల‌వ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement