Saturday, May 4, 2024

Priyanka Gandhi మనీలాండరింగ్ కేసులో..ఈడీ ఛార్జిషీట్‌..

పీఎంఎల్‌ఏ కేసులో ఈడీ ఛార్జిషీట్‌లో ప్రియాంక గాంధీ పేరు పెట్టారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ ద్వారా హర్యానాలో భూమిని కొనుగోలు చేశారని ఈడీ తన చార్జ్ షీటులో పేర్కొంది.

ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త సీసీ థంపీకి భూమిని విక్రయించారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఇంతకుముందు ఛార్జ్ షీట్‌లలో వాద్రా పేరును థంపీ సన్నిహితుడిగా ఈడీ పేర్కొన్నప్పటికీ, ప్రియాంక పేరు ప్రస్తావనకు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఓ కేసులో పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ, మనీలాండరింగ్, విదేశీ మారక ద్రవ్యం, నల్లధనం చట్టాల ఉల్లంఘన, అధికారిక రహస్యాల చట్టంపై పలు ఏజెన్సీలు విచారిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement