Sunday, April 28, 2024

National: జమ్మూకశ్మీర్ లో భూకంపం…

జమ్మూకశ్మీర్ లో ఇవాళ తెల్లవారు జామున భూకంపం సంభవించింది. 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎస్సిఎస్) తెలిపింది.

- Advertisement -

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ భూకంపం తెల్లవారుజామున 2: 47 గంటల సమయంలో సంభవించింది తెలిపారు. అలాగే, నిన్న కూడా జమ్మూ కాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలో 3.8 తీవ్రతతో భూకంపం వచ్చింది.అయితే, జమ్మూకశ్మీర్ లో వరుసగా గత మూడు రోజుల నుంచి ఆప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం ఇది మూడోసారిఅని ఎన్సీఎస్ తెలిపింది. అంతకు ముందు శుక్రవారం రాత్రి 11గంటల సమయంలో భూకంపం రాగా, రిక్టరు స్కేలుపై భూకంపంతీవ్రత 3.2గా నమోదు అయింది. ఇక, శనివారం మధ్యాహ్నంవచ్చిన భూకంపంలో 3. 8 తీవ్ర నమోదైంది.

ఇక, ఇవాళ తెల్లవారుజామున వచ్చిన భూకంపం 3.5 శాతంగా రిక్టార్ స్కేలుపై నమోదైంది. అయితే, అదృష్టవశాత్తూ భూకంపం తీవ్రత స్వల్ప వ్యవధిలోనే ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement