Saturday, May 4, 2024

ఉత్తరాఖండ్ తో పాటు అఫ్ఘానిస్థాన్ , టాంగా దేశాలలో భూకంపం

ఒకే రోజు మూడు చోట్ల భూకంపం సంభవించింది. గురువారం నాడు టాంగా దేశంతోపాటు భారతదేశంలోని ఉత్తరాఖండ్,అఫ్ఘానిస్థాన్ దేశంలో ఫైజాబాద్ ప్రాంతాల్లో ఒకే సారి భూకంపాలు సంభవించాయి.టాంగాలో సంభవించిన భారీభూకంపం రిక్టర్ స్కేలుపై 7.6 గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియలాజికల్ సర్వే ట్వీట్ చేసింది.టాంగాలోని హిహిపోకు 95 కిలోమీటర్ల దూరంలో గురువారం తెల్లవారుజామున 4.02 గంటలకు 210 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది..

.ఆఫ్ఘానిస్థాన్ దేశంలోని ఫైజాబాద్ నగరంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని పితోరాఘడ్ ప్రాంతంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement