Thursday, May 2, 2024

Delhi: రేపటి నుంచి బొగ్గు గనుల ఈ-వేలం.. రెండ్రోజుల్లో 10 గనుల వేలం నిర్వహించనున్న కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రేపటి (మంగళవారం) నుంచి బొగ్గు గనుల ఈ-వేలం ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. కేంద్ర బొగ్గు శాఖ ఇప్పటికే గనుల వేలంలో పాల్గొనే అర్హత కల్గిన సంస్థలను ఎంపిక చేసింది. నేడు (మంగళవారం) 8 బొగ్గు గనులు, బుధవారం మరో 2 బొగ్గు గనులను ఈ-వేలం వేయనున్నట్టు బొగ్గు శాఖ ప్రకటించింది. మొత్తం ఈ 10 బొగ్గు గనుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 39.31 మిలియన్ టన్నులుగా కేంద్రం పేర్కొంది. ఇప్పటి వరకు 85.54 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 43 బొగ్గు గనులను విజయవంతంగా వేలం నిర్వహించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement