Friday, April 26, 2024

జబర్దస్త్ లో డబుల్ మీనింగ్ డైలాగులు.. రెచ్చిపోతున్న హైపర్ ఆది

జబర్దస్త్ కామెడీ షో లో ఆది ఎప్పుడయితే టీం లీడర్ అయ్యాడో అప్పటి నుండి ఆ షోలో బూతుల వర్షం కురుస్తోంది. జబర్దస్త్ టీఆర్పి రేటింగ్ అంతలా పెరగటానికి ముఖ్య కారణం హైపర్ ఆది అని మల్లె మాల వాళ్ళకు కూడా తెలుసు. అతని వల్లే రేటింగ్ వస్తుంది అని ఫిక్స్ అయ్యారట. అసలే చాలా మంది టీమ్ లీడర్లు, యాంకర్స్, జడ్జ్ లు వెళ్లి పోయిన జబర్థస్త్ ను హైపర్ ఆది తన డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇక ప్రెజెంట్ యూత్ మాత్రం ఫోన్ లో .. యూట్యూబ్ లో ఆది స్కిట్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

ఇదిలావుంటే రీసెంట్ గా మల్లెమాల జబర్దస్త్ షో ఈ వారం ప్రోమోను విడుదల చేశారు.ఇక ఈ ప్రోమోలో హైపర్ ఆది ఎప్పటిలాగానే తనలోని డబల్ మీనింగ్ క్రియేటివీటిని బయట పెట్టాడు. ఇప్పటికే తాను కొత్త యాంకర్ ను రకరకాల కామెంట్స్ తో గోకాలని చూస్తున్నాడు. ప్రోమో లో జడ్జ్ కృష్ణ భగవాన్ ఈ ప్రపంచంలో అందరూ మరణిస్తే మీరు మాత్రమే ఉంటే ఏం చేస్తారు అని అడిగాడు. దానికి ఆది బదులిస్తూ ఇద్దరూ ఫుల్ గా కాపురం చేసి మరో ప్రపంచం పుట్టిస్తామని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడీ ప్రోమో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement