కుత్బుల్లాపూర్ (ప్రభన్యూస్): జీవో నెం. 58, 59 కింద దరఖాస్తు చేసుకున్న పేదలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేశారు. ఇవ్వాల (శనివారం) ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరేకిపుడి గాంధీ, ఎం.పి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి బి.ఆర్.అంబెద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. దీనికి సీఎం కేసీఆర్సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-22-at-9.02.48-PM-1024x682.webp)