Saturday, May 18, 2024

నెలలో ఒకరోజు పీహెచ్‌సీల్లో డీఎంహెచ్‌వో, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు నిద్ర చేయాలి : మంత్రి హరీష్‌ రావు

మంత్రి హరీష్‌ రావు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుంచి ఆస్పత్రుల అభివృద్ధి ఎంతగానో కృషి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సిబ్బంది పనితీరుపై ఆరా తీస్తూ తనిఖీలు నిర్వహించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బంది సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా వైద్యాధికారులకు మంత్రి హరీస్‌ రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. నెల రోజుల్లో ఒక రోజు పీహెచ్‌సీలలో నిద్రపోవాలని డీఎంహెచ్‌వో, డిప్యూటీ డీఎంహెచ్‌వోలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోవాలన్నారు. తానుకూడా ఒకరోజు ఆస్పత్రిలో నిద్ర చేస్తానన్న మంత్రి హరీస్‌ రావు అన్నారు. ఆస్పత్రుల్లో నెలకన్న సమస్యలను తెలుసుకుని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement