Saturday, May 4, 2024

ఈదురు గాలులతో విమానాల దారి మళ్ళింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాజధాని హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలు దిగేందుకు వాతావరణం అనుకూలించలేదు. దీంతో హైదారాబాద్‌కు రావాల్సిన విమానాలను అధికారులు దారి మళ్ళించారు. గంట వ్యవధిలోనే నాలుగు విమానాలను దారి మళ్ళించారు. రెండు ఇండిగో విమానాలను గన్నవరం ఎయిర్‌పోర్టుకు మళ్ళించగా, ఢిల్లి, ముంబై నుంచి రావాల్సిన విమానాలను బెంగళూరుకు మళ్ళించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement