Tuesday, April 23, 2024

పది పరీక్షలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితం ప్రయాణం..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఈ నెల 27వ తేదీ నుంచి మే తొమ్మిదో తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు ఆరు లక్షల 22 వేల 746 మంది విద్యార్థులు హబుూజరు కానున్నారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 7 వేల 780 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏడాది పరీక్షలను జంబ్లింగ్‌ విధానంలో నిర్వహిస్తుండటంతో విద్యార్థుల పరీక్షా కేంద్రాలు వేరే ప్రాంతాల్లో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా, వారిపై ఎలాంటి చార్జీల భారం పడకుండా ఉచిత రవాణా సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌ సూచనల మేరకు ఆర్టీసీ వారందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి ఉదయం 9.30కు పరీక్షలు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు పూర్తవుతాయి. ఈ సమయాలకనుగుణంగా విద్యార్థులు తమ నివాసాల నుంచి పరీక్షా కేంద్రానికి, తిరిగి ఇళ్లకు చేరుకునేలా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో హాల్‌ టికెట్లను చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని స్పష్టం చేసింది. ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఉత్తర్వులపై మున్సిపల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌. రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement