Tuesday, April 30, 2024

ద‌ర్శ‌క‌నిర్మాత య‌శ్ చోప్రా భార్య ప‌మేలా.. కన్నుమూత

2012లో ద‌ర్శ‌క‌నిర్మాత య‌శ్ చోప్రా క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. కాగా నేడు ఆయ‌న భార్య ప‌మేలా చోప్రా క‌న్నుమూశారు.
ఆమె వయసు 74 ఏళ్లు. యశ్, పమేలా దంపతులది పెద్దలు కుదిర్చిన వివాహం. 1970లో సాంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రా ఉన్నారు. ఆదిత్య చోప్రా దర్శకుడు, నిర్మాతగా ఉన్నారు. బాలీవుడ్ నటి రాణి ముఖర్జీని ఆయన పెళ్లి చేసుకున్నారు. ఉదయ్ చోప్రా సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా పేమేలా చోప్రా గత 15 రోజులుగా ఆమె ముంబైలోని లీలావతి ఆసుపత్రలో చికిత్స పొందారు. ఆమెను వెంటిలేటర్ పై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 11 గంటలకు ముంబైలో ఆమెకు అంత్యక్రియలను కూడా నిర్వహించారు. పమేలా చోప్రా కు ప్లే బ్యాక్ సింగర్ గా మంచి గుర్తింపు ఉంది. ఆమె సినీ రచయిత, నిర్మాత కూడా.

Advertisement

తాజా వార్తలు

Advertisement