Tuesday, May 21, 2024

ప‌ర్యావ‌ర‌ణ మార్పుపై ఐరాస వినూత్న ఐడియా..సందేశం ఇచ్చిన డైనోసార్..

రోజు రోజుకి కాలుష్యం..భూతాపాలు పెరిగిపోతున్నాయి. దాంతో పర్యావరణంలో విప‌రీత‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాంతో ఈ మార్పులపై ఐక్యరాజ్యసమితి వినూత్న చర్య చేప‌ట్టింది. డైనోసార్ తో ‘మానవ అంతం’పై సందేశాన్ని ఇప్పించారు. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలంటూ సూచన చేసిందా డైనోసార్..శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని హితవు ప‌లికింది. వివారాల్లోకి వెళ్తే.. ఐక్యరాజ్య సమితి సమావేశం జరుగుతోంది. ఇంతలో అక్కడికి ఓ డైనోసార్ వచ్చింది. అంతా ఉలిక్కి పడ్డారు. అయితే ఆ డైనోస‌ర్ వేదిక వద్దకు వెళ్లింది. మైకును సరి చేసింది. గొంతును సవరించుకుంది. ‘ప్రజలారా వినండి..’ అంటూ మొదలుపెట్టింది.

పర్యావరణ మార్పులపై తాజాగా ఐక్యరాజ్యసమితి వినూత్న సందేశం ఇప్పించింది. అంతరించిపోయిన డైనోసార్లతో.. జనం అనే మనం కూడా అంతరించిపోతామని హెచ్చరిక ఇప్పించింది. గ్రాఫిక్స్ తో ఓ డైనోసార్ ను రూపొందించి.. నిజంగా ఓ డైనోసార్ మనముందు మాట్లాడుతోందన్న భ్రాంతిని కలిగించింది. ప్రజలారా వినండి అంటూ స్టార్ట్ చేసిందా డైనోస‌ర్.. మీరంతా పర్యావరణ విపత్తు దిశగా అడుగులేస్తున్నారు. పెద్ద పెద్ద ఉల్కలపై అంతే మొత్తాన్ని మనం ఖర్చు చేస్తున్నామనుకోండి.. ఏమవుతుంది ఇప్పుడు మీరు చేస్తున్నది అదే. ప్రతి సంవత్సరం అన్ని ప్రభుత్వాలు లక్షలాది కోట్ల ప్రజాధనాన్ని.. వినాశనంపై ఖర్చు చేయడానికి బదులు.. పేదలకు సాయం చేస్తే బాగుంటుందనిపించలేదా.. ఎప్పుడూ మీ అంతం కోసం మీరే డబ్బులు ఖర్చు చేసుకుంటారా అని నిల‌దీసింది..

ఇప్పటికైనా మించిపోయింది లేదు. మహమ్మారి నుంచి కోలుకుంటూ ఇప్పుడిప్పుడే మీ ఆర్థిక వ్యవస్థలను పటిష్ఠం చేసుకుంటున్నారు. కాబట్టి మీకిదే నేనిచ్చే ఓ మంచి సలహా. మీ అంతాన్ని మీరే కోరుకోకండి. సమయం మించిపోకముందే మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇప్పటికైనా మార్పులను ఆహ్వానించండి.. మారండి. దాని నుంచి తప్పుకునేందుకు వంకలు వెతుక్కోవద్దు. థాంక్యూ’’ అంటూ ఆ గ్రాఫిక్స్ డిజైనర్ డైనోసార్ తన ప్రసంగాన్ని ముగించేసింది. అంతే హాలు హాలంతా చప్పట్లతో మార్మోగి పోయింది. ఈ ఐడియా ఇచ్చిందెవ‌రో తెలియ‌దు కానీ వావ్ అనిపించేలా ప్ర‌సంగించింది డైనోస‌ర్. మ‌రి ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వాల్లో మార్పు వ‌స్తుందేమో చూద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement