Sunday, May 12, 2024

యాదాద్రిలో భక్తుల రద్దీ

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు తెల్లవారుజామునుంచే స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చారు. స్వామి వారి దర్శనానికి సుమారుగా గంట సమయం పడుతుంది. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతిని నిరాకరించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement